లాక్ డౌన్ సమయంలో ఇప్పుడు జనాలకు కొన్ని వీడియో లు వినోదాన్ని పంచుతున్నాయి అనేది వాస్తవం. ముఖ్యంగా సామాజిక మద్యాలు ట్విట్టర్, ఫేస్బుక్ లో వైరల్ అవుతున్న వీడియోలలో ఎక్కువగా అటవీ జంతువులకు సంబంధించినవే ఉంటున్నాయి. తాజాగా ఏనుగులకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

అది ఏంటీ అంటే 14 సెకన్ల క్లిప్ గడ్డి మైదానంలో రికార్డ్ చేసారు. ఏనుగుల గుంపు అక్కడి గడ్డి మైదానంలో ఉన్న సమయంలో అక్కడ కొంగలు వాలుతూ ఉంటాయి. వాటి తో ఏనుగు పిల్ల ఆడుకుంటూ కనపడుతుంది. ఈ వీడియో ని భారత అటవీ శాఖ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్ లో షేర్ చేసారు. ఎంత క్యూట్ గా ఉందో అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: