విశాఖ గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో చర్యలకు ఏపీ సర్కార్ శ్రీకార౦ చుట్టింది. అక్కడ శానిటేషన్ చేయడమే కాకుండా ప్రజల్లో ధైర్యం కల్పించడానికి గానూ గ్రామాల్లో తిరుగుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ గ్రామాల్లో ఎక్కువగా తిరుగుతున్నారు. మంత్రుల బసతో బాధితుల్లో ధైర్యం వచ్చింది అని అంటున్నారు. 

 

బాధితులకు ధైర్యం చెప్పాలని సిఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇవ్వడం తో మంత్రులు గ్రామాల్లో అడుగు పెట్టారు. సోమవారం రాత్రి నలుగురు మంత్రులు అవంతి శ్రీనివాస్‌, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్‌, కురసాల కన్నబాబు, ఎంపీ విజయసాయిరెడ్డి, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో నిద్ర చేసి అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: