ఈ లాక్ డౌన్ నేప‌థ్యంలో ర‌క‌ర‌కాల జోకులు పేలుతున్నాయి. కొంద‌రు సెల‌బ్రిటీలు సైతం ఇంట్లో వంట ప‌నులు.. ఇంటి ప‌నులు లేదా ఇంకేవో ప‌నులు చేస్తోన్న వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాలో ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనాపై. . లాక్‌డౌన్ పై ర‌క‌ర‌కాల జోకులు, వీడియోలు కుప్ప‌లు తెప్ప‌లుగా క‌నిపిస్తున్నాయి.  ఈ క్ర‌మంలోనే బ్ర‌హ్మానందం సినిమాలో ని ఓ స్టిల్ తీసుకుని క‌రోనా ను బేస్ చేసుకుని ఉన్న ఓ ఫొటో సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. 

 

ఇంత‌కు అబ్బాయికి ఏం పెడుతున్నారు. అన్న ప్ర‌శ్న‌కు రెండు జ‌త‌ల మాస్కులు, రెండు లీట‌ర్ల శానిటైజ‌ర్‌, అల‌క పాన్పు మీద పిపియి కిట్టు, ఒక జిల్లాకు ఒక జిల్లాకు పోవ‌డానికి రెండు పాస్‌లు అన్న మెసేజ్ అందులో ఉంటుంది. ఇప్ప‌డు ఈ మెసేజ్ సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతోంది. వేలాది షేర్లు, లైకుల‌తో హోరెత్తుతోంది. దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: