జమ్ముకశ్మీర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కు చెందిన ఒక అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో విధులు నిర్వహిస్తున్న ఆయన ఈ తెల్లవారుజామున తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. ఏఎస్ఐ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ఈ ఘటన గురించి అతని కుటుంబసభ్యులకు తెలియజేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఘటనపై అంతర్గత దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేపింది. తోటి సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే.. ఈ ఏఎస్సైఐ ఆత్మహత్యకు కారణాలు సమగ్ర దర్యాప్తు జరిగితేనే తెలిసే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు అంటున్నాయి.