ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. చెన్నై కోయంబేడు మార్కెట్ లింక్ లు ఇప్పుడు ఏపీ ని కలవరపెడుతున్నాయి. గుంటూరు గోదావరి జిల్లాల్లో, చిత్తూరు జిల్లాలో నమోదు అవుతున్న కేసులు అన్నీ కూడా ఇప్పుడు కోయంబేడు తో సంబంధం ఉన్నవే. 

 

నేడు నమోదు అయిన 20 కేసులు అన్నీ కూడా కోయంబేడు తో లింక్ ఉన్న వాళ్ళవే. కోయంబేడు తో లింక్ లు ఉన్న వాళ్ళను ఇప్పుడు గుర్తించే పనిలో ఏపీ సర్కార్ ఉంది. వారిలో 3129 మందికి కోయంబేడు లింక్ లు ఉన్నాయని తెలిసింది. వాళ్ళు అందరూ ఏ విధంగా రాష్ట్రంలోకి అడుగు పెట్టారు అనేది అర్ధం కావడం లేదు. చెన్నై కు కూతవేటు దూరంలో ఉండే చిత్తూరు లో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: