దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ సాయంత్రం 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించ నున్నారు. లాక్ డౌన్ పై ముఖ్యమంత్రులతో సుదీర్ఘంగా చర్చించిన మోడీ... సాయంత్రం లాక్ డౌన్ పై ప్రకటన చేసే అవకాశం ఉంది. నిన్న ముఖ్యమంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా అందరూ కూడా  లాక్ డౌన్ అవసరమే అనే అభిప్రాయాన్ని చెప్పారు. 

 

ఇప్పటికే లాక్ డౌన్ మే 17 వరకు కేంద్ర సర్కార్ పెంచిన సంగతి తెలిసిందే. సాయంత్రం లాక్ డౌన్ ని మే 30 వరకు పెంచే సూచనలు కనపడుతున్నాయి. దీనితో ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆయన ఏ నిర్ణయం వెల్లడిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే లాక్ డౌన్ ని పెంచే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: