ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో ఈరోజు కేవలం 33 కేసులు నమోదయ్యాయి. ఈ 33 కేసులలో చిత్తూరులో 10, నెల్లూరులో 9, తూర్పు గోదావరిలో ఒక కేసు నమోదు కాగా ఈ కేసులన్నీ తమిళనాడు నుండి వచ్చిన కేసులు కావడం గమనార్హం. తమిళనాడు నుండి రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికులకు కరోనా నిర్ధారణ అయింది. ఈ కేసులు కాకుండా రాష్ట్రంలో రెండు జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో 9 కేసులు నమోదు కాగా కృష్ణా జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో గత మూడు రోజుల నుంచి కరోనా  తగ్గుముఖం పడుతోంది. ఈరోజు నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2051కు చేరింది. రాష్ట్రంలో 1056 మంది డిశ్చార్జ్ కాగా 949 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: