తన ఆరోగ్యంపై వస్తున్న వదంతుల పై తెలంగాణా మంత్రి కేటిఆర్ స్పందించారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నా అని, తన ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ఆయన స్పష్టం చేసారు. గత రెండు మూడు రోజులు గా మంత్రి పూర్తి జలుబు తో బాధ పడుతుంటే కొందరు కరోనా లక్షణాలు అని ప్రచారం చేసారు. 

 

దీనిపై స్పందించిన మంత్రి అసలు ఏ ఇబ్బంది లేదన్నారు. సిరిసిల్లలో సోమవారం నాటి పర్యటన సందర్భంగా తనకు అనేక సంవత్సరాలుగా ఉన్న జలుబుకు సంబంధించిన ఎలర్జీ వచ్చిందన్నారు. తన ఆరోగ్యంపై ఆందోళన చెందొద్దని ఆందోళన చెందిన వారు అందరికి ధన్యవాదాలు అని కేటిఅర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. తన ఆరోగ్యంపై అనవసర ప్రచారం వద్దని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: