శ్రీశైలం జలాల విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కుమ్మక్కై వ్యవహరిస్తున్నారని తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. పోతిరెడ్డి పాడు విషయంలో తాము మాట్లాడే వరకు తెలంగాణా సిఎం మాట్లాడలేదని ఆయన మండిపడ్డారు. 

 

తెలంగాణా ఒక టిఎంసి తగ్గిస్తే ఏపీ పెంచుకుంటూ పోతుందని ఆయన ఆరోపించారు. తెలంగాణా వాదం ముసుగులో తెలంగాణా ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు అని ఆయన విమర్శించారు. నీళ్ళ కోసమే కదా తెలంగాణా ఉద్యమం జరిగింది అని ఆయన ప్రశ్నించారు. విపక్షాల ఆరోపణలపై అధికార పార్టీ కూడా ఘాటుగానే స్పందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: