తెలంగాణా నుంచి ఎవరు వచ్చినా సరే ఏపీ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఎవరు వచ్చినా సరే క్వారంటైన్ కి తరలిస్తున్నారు అధికారులు. బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. సామాన్యులు ఎవరిని అనుమతించడం లేదు అధికారులు. ఇక ప్రముఖులు ఎవరు అయినా వచ్చినా హోం క్వారంటైన్ లోనే ఉండాలి అని స్పష్టం చేస్తున్నారు. 

 

తాజాగా ప్రముఖ బ్యాట్మింటన్ కోచ్ పుల్లెల గోపి చంద్ ని హోం క్వారంటైన్ చేసారు అధికారులు. సూర్యాపేట జిల్లా రామాపురం చెక్ పోస్ట్ వద్ద ఆయనకు క్వారంటైన్ ముద్ర వేసారు అధికారులు. దీనితో గోపి చంద్ ఇక హోం క్వారంటైన్ లోనే ఉండనున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న సమయంలో ఈ పరిణామం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: