టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి హత్యాయత్నం కేసుని పోలీసులు చేధించారు. కడప జిల్లాలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి అఖిలప్రియ భర్త భార్గవ్ పిఏ శ్రీనివాసులు గా గుర్తించారు. సుబ్బా రెడ్డి ని హత్య చేయడానికి గానూ అతను 50 లక్షల సుపారి తీసుకున్నాడు అని విచారణ లో వెల్లడి అయింది. 

 

తనను గతంలో చంపడానికి భూమా కుటుంబం ప్రయత్నాలు చేసింది అని ఆరోపణలు చేసారు సుబ్బా రెడ్డి. అప్పుడే హత్య చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు కథ బయటపడింది. భూమా కుటుంబానికి ఏవీ కుటుంబానికి మధ్య ఆర్ధిక లావాదేవీలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. దీనితో ఒక్కసారిగా జిల్లా టీడీపీలో అలజడి రేగింది

మరింత సమాచారం తెలుసుకోండి: