తెలంగాణా ఏపీ సర్కార్ జల వివాదం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు తెలంగాణా నేతలు మండిపడుతున్న తరుణంలో తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేతలు దామోదర రాజ నరసింహ, పొన్నం ప్రభాకర్ భిన్నమైన ప్రకటనలు చేసారు. కాంగ్రెస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వీళ్ళు కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

పోతిరెడ్డి పాడుపై ఆందోళనలు చెయ్యాలని కాంగ్రెస్ పిలుపు ఇవ్వగా దీనిపై స్పందించిన ఇద్దరూ... ప్రస్తుతం కరోనాపైనే ఆందోళన చెయ్యాలని అభిప్రాయపడ్డారు. వలస కార్మికులు కరోనా కష్టాలపై పక్క దారి పట్టించడానికే ఈ వివాదాన్ని తెర మీదకు తీసుకుని వచ్చారని, పోతిరెడ్డి పాడుని ఈ విధంగా వాడుకుంటున్నారు అని మండిపడ్డారు. జల వివాదాన్ని కొందరు వాడుకుంటున్నారు అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: