విశాఖ ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో ప్రజల ప్రాణాలను కాపాడిన వారిలో ఎక్కువగా యువకులే ఉన్నారు. తమకు అందుబాటులో ఉన్న వాహనాల ద్వారా చాలా మంది ప్రాణాలను కాపాడారు యువకులు. ఈ క్రమంలోనే కొందరు యువకులకు కూడా గ్యాస్ ప్రభావం తగిలింది. ఒక 26 ఏళ్ళ యువకుడు 25 మందిని గ్యాస్ బారి నుంచి కాపాడి ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

 

ఈ నెల 7 న జరిగిన గ్యాస్ లీక్ ఘటనలో వెంకటాపురం గ్రామానికి చెందిన అశ్విని కుమార్ ఇప్పుడు కెజిహెచ్ లో చికిత్స పొందుతున్నాడు. అతన్ని మీడియా సంప్రదించగా ఆ రోజు జరిగిన ఘటనను వివరించాడు. తన చుట్టూ ఉన్న 25 మంది ప్రాణాలను తాను కాపాడా అని, వీలైనంత మందిని తరలించా అని వివరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: