దేశ వ్యాప్తంగా పలు రైలు సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు రైలు సర్వీసులు ఆగుతాయి. ఈ నేపధ్యంలోనే తొలి రైలు నేడు సికింద్రాబాద్ స్టేషన్ లో ఆగుతుంది. బెంగళూరు-దిల్లీ మధ్య నడిచే ఏసీ సూపర్‌ఫాస్ట్‌(రాజధాని) ట్రైన్... మంగళవారం 8.30 గంటలకు కేఎస్‌ఆర్‌ బెంగళూరు స్టేషన్‌ నుంచి ప్రయాణం మొదలుపెట్టి బుధవారం ఉదయం... 7.55 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంది. 

 

10 నిముషాలు ఆగి... గురువారం తెల్లవారుజామున 5.55 గంటలకు దిల్లీలో ఆగుతుంది. ఇక లాక్ డౌన్ కారణంగా బెంగళూరు లో ఆగిపోయిన 200 మంది తెలంగాణా ప్రాంతానికి చెందిన వారు సొంత ప్రాంతాలకు వస్తారు. ఇక వారు అందరిని అధికారులు హోం క్వారంటైన్ కి తరలిస్తారు. ఎప్పటికప్పుడు వారిని సమీక్షిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: