దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. గత పది రోజుల నుంచి అత్యంత వేగంగా కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3525 మందికి కరోనా సోకిందని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 122 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. 

 

దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు దీనితో 74281గా ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం  47480గా ఉందని కేంద్రం పేర్కొంది. మొత్తం కరోనా కారణంగా 2415 మంది ప్రాణాలు కోల్పోయారు. 24,386 మంది కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: