తెలుగుదేశ౦ పార్టీ చరిత్రలో మహానాడు కి ఏ స్థాయిలో ప్రాధాన్యత ఉందో అందరికి తెలిసిందే. మే నెల చివరి వారంలో మూడు రోజుల పాటు దీనిని నిర్వహిస్తుంది తెలుగుదేశం పార్టీ. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ మహానాడు పండగకు హాజరై పార్టీ మీద తమకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. 

 

ఇప్పుడు కరోనా నేపధ్యంలో ఈ కార్యక్రమాన్ని జూమ్ యాప్ లో నిర్వహించాలి అని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. నేడు పాలిట్బ్యూరో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పది వేల మంది తో జూమ్ యాప్ ద్వారా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్దమయ్యారు. రెండు రోజుల్లో దీనిపై ప్రకటన రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: