ఏపీ సర్కార్ పలువురు ఐపిఎస్ అధికారులను బదిలి చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది ఏపీ సర్కార్. ఇసుక, మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలకు గానూ వీరిని బదిలీ చేసింది ప్రభుత్వం. జిల్లాల వారీగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులుగా ఏఎస్పీలను ప్రభుత్వం నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమీషనర్గా వినీత్ బ్రిజ్లాల్ను నియమించింది.
ఒకసారి బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు ఎవరు అంటే...
గుంటూరు రూరల్ - కె.ఆరిఫ్ హఫీజ్
తూర్పు గోదావరి - గరుడ్ సుమిత్ సునీల్
విశాఖపట్నం రూరల్ - రాహుల్ దేవ్ సింగ్
విశాఖ సిటీ - అజిత వేజెండ్ల
కర్నూలు - గౌతమి శాలి
కృష్ణా - వకుల్ జిందాల్
చిత్తూరు - రిషాంత్ రెడ్డి