ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాయంత్రం మీడియా తో మాట్లాడే అవకాశాలు ఉన్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. నేడు ఆయన కరోనా వైరస్ కట్టడిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆర్ధిక శాఖపై కూడా జగన్ సమీక్ష నిర్వహిస్తారని అధికారిక ప్రకటన వచ్చింది. 

 

సాయంత్రం ఆయన పరిస్థితి ఆధారంగా సమయం చూసుకుని మీడియా తో మాట్లాడే అవకాశం ఉందని, జగన్ నుంచి కీలక ప్రకటన వచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు.  కాగా లాక్ డౌన్ విషయంలో జగన్ నేడు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే ఆర్ధిక ప్యాకేజి విషయంలో కూడా జగన్ నిర్ణయం వచ్చే సూచనలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: