కేరళ రాష్ట్రంలో 54 ఏళ్ల మహిళ కవలలకు జన్మనిచ్చింది. కేరళ రాష్ట్రానికి చెందిన కుమారి, శ్రీధరన్ దంపతుల కుమారుడు రెండేళ్ల క్రితం ఒక ప్రమాదంలో మరణించాడు. ఎదిగిన కొడుకు మృతి చెందడంతో దంపతులు ఒంటరి అయ్యారు. సంతానం కావాలని కలలు కని ఆ కలను నెరవేర్చుకున్నారు. ఫెర్టిలిటి ట్రీట్‌మెంట్‌ ద్వారా కుమారి కవలలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒకరు ఆడ శిశువు కాగా మరొకరు మగ శిశువు కావడం గమనార్హం. 
 
కొంతకాలం నుంచి కొల్లాంలోని లైఫ్‌లైన్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న కుమారి ఈ వయసులో పిల్లల్ని కంటామని ఊహించలేదని... కొడుకు చనిపోయిన తర్వాత పిల్లలను కనాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. 54 ఏళ్ల వయస్సులో కవల పిల్లలు జన్మించడంతో దంపతులు సంతోషంలో మునిగిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: