బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సీఎం కేసీఆర్ ద్వంద్వ విధానాలకు అవలంబిస్తున్నారని చెప్పారు. పోతిరెడ్డిపాడు విషయంలో తెలంగాణ వైఖరిని నిరసిస్తూ బండి సంజయ్ ఆరోపణలు చేశారు. ఈరోజు ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విషయంలో ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. 
 
ఏపీ సర్కార్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తుంటే కేసీఆర్ స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. కేసీఆర్, జగన్ అన్నాదమ్ములని... అన్నాదమ్ముళ్లు రెండు తెలుగు రాష్ట్రాలను దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఇద్దరు సీఎంలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇద్దరు సీఎంలు రహస్యంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారని... కేసీఆర్ స్పందించకపోతే ప్రజలు తిరగబడతారని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: