పోతిరెడ్డి పాడు జలాల విషయంలో ఇప్పుడు బిజెపి వైఖరి విడ్డూరంగా మారింది. ప్రాంతాల వారీగా నాయకులు ఇప్పుడు కీలక ప్రసంగాలు చేస్తున్నారు. బిజెపి నేతలు తెలంగాణాలో ఒక మాట, ఏపీలో ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. పోతిరెడ్డి పాడు విషయంలో జగన్ నిర్ణయం సరైనది అని, కేసీఆర్ తప్పుడు చేస్తున్నారు ఏపీ బిజెపి వ్యాఖ్యానిస్తుంటే... 

 

తెలంగాణా బిజెపి ఏమో... జగన్ సర్కార్ తప్పు చేస్తుంది, కేసీఆర్ ఎపీతో కుమ్మక్కు అయి తెలంగాణాను నాశనం చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక దీక్షలు కూడా బిజెపి నేతలు చేస్తున్నారు. కాగా ఏపీ ప్రభుత్వం వ్యవహారంపై ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం కృష్ణా యాజమాన్య బోర్డ్ కి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ మొదలయింది. జీవో ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది తెలంగాణా.

మరింత సమాచారం తెలుసుకోండి: