రైతులు పెద్ద మనసుతో  కాలువల భూ సేకరణకు సహకరించాలని తెలంగాణా ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేసారు. సిద్ధిపేట రూరల్ మండలంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టాదారు పాసు పుస్తకాలను ఆయన పంపిణి చేసారు. కాళేశ్వరం నీళ్లు వచ్చాక మొదటిసారి పట్టాల పంపిణీ జరగుతుడండం సంతోషంగా ఉందన్నారు హరీష్ రావు. 

 

ఎంతోమంది రైతులు సహకరిస్తేనే కాళేశ్వరం నీళ్లు ఇక్కడి వరకు వచ్చాయని ఆయన అభినందించారు. భూ సేకరణకు రైతులు స్వచ్చందంగా ముందుకు రావాలని కోరారు. గతంలో పేలిపోయి ట్రాన్స్ఫార్మర్స్, కాలిపోయి మోటర్లు తో పంటలు పండి రైతులు ఖర్చుల పాలు అయ్యేవారని గుర్తు చేసారు. కానీ నేడు టీఆర్ఎస్ పాలనలోనే నిజమైన రైతురాజ్యం వచ్చిందన్నారు హరీష్.

మరింత సమాచారం తెలుసుకోండి: