కరోనా నివారణ చర్యలు, లాక్ డౌన్ పెంపు అంశాలపై కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ నిపుణులు, ఆర్ధిక వేత్తలతో చర్చలు జరుపుతున్నారు. ఇక లాక్ డౌన్ ని ఈ నెల 18 నుంచి పెంచే అవకాశం ఉన్న నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి స్థాయి చర్చలు జరుపుతున్నారు. 

 

నాలుగో విడత లాక్ డౌన్ పై ఆయన కేంద్ర మంత్రులతో తన నివాసంలో భేటి అయ్యారు. సామాజిక దూరం పాటిస్తూ ఈ భేటి జరిగింది. ఈ భేటీ లో ఆర్ధిక పరిస్థితి సహా కొన్ని రాష్ట్రాల కరోనా కేసులపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల గురించి ప్రధానంగా చర్చ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: