పోతిరెడ్డి పాడు విషయంలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రుల తప్పు అని కొందరు అంటే ఏపీ సర్కార్ దూకుడు అని మరి కొందరు అంటున్నారు. ఇక ఈ వ్యవహారంపై తెలంగాణా సిఎం కేసీఆర్ ని అక్కడి బిజెపి నేతలు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. 

 

తాజాగా తెలంగాణా బిజెపి చీఫ్, ఎంపీ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ జగన్ అన్నదమ్ములు అని ఏపీ మంత్రి అనీల్ అన్న వ్యాఖ్యలను ప్రస్తావించారు. పోతిరెడ్డి పాడు విషయంలో కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన ఒప్పందం ఏంటీ అని ప్రశ్నించారు. అన్నదమ్ములు కలిసి రెండు రాష్ట్రాలను దోచుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై కేసీఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: