విశాఖ ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ ఇంకా ఆగలేదా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. గ్యాస్ ఆగినా సరే కొన్ని చోట్ల అది గాలిలో నిల ఉండిపోయింది అని అక్కడి వారు చెప్తున్నారు. గ్రామాల్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం అక్కడ భిన్నంగా ఉన్నాయి. 

 

తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో విష వాయువు ప్రభావం కొనసాగుతుంది. విషవాయువు ప్రభావం తో వీఆర్వో తులసి సొమ్మసిల్లి పడిపోయారు. అలాగే మరో ముగ్గురు ఇళ్ళల్లోనే సొమ్మసిల్లి పడిపోయారు. దీనితో వారు ముగ్గురిని గోపాల పట్నం ప్రభుత్వ ఆస్పత్రికి అధికారులు తరలించారు. కాగా గ్యాస్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు కూడా బస చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: