విశాఖ వాసులు ఇంకా కోలుకోలేదు. ఈ బాధ నుంచి కోలుకోక ముందే.. రెండు రోజుల క్రితం తెలంగాణలో కుమరం భీమ్ ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో ఎస్‌పీఎం కాగితపు పరిశ్రమలో గ్యాస్‌ లీక్‌ అయింది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఈ రోజు ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైంది. ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.  నందిగామ మండలం మేకగూడ శివారులోని బిస్కెట్‌ పరిశ్రమలో గ్యాస్‌ లీక్ అయింది. ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. 

 

 సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటి అక్కడకు చేరుకుని కార్మికులను శంషాబాద్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఫైరింజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.  కార్మికులను శంషాబాద్‌లోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: