కరోనా వైద్యుల విషయంలో తెలంగాణా గాంధీ ఆస్పత్రి వైద్యులు వ్యవహరిస్తున్న తీరు దేశ వ్యాప్తంగా మన్నలను పొందుతుంది. ఎక్కడిక్కడ చాలా చక్కగా వాళ్ళు వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం ఆదేశాలతో సంబంధం లేకుండా వాళ్ళ పని వాళ్ళు సమర్ధవంతంగా చేస్తున్నారని పలువురు కొనియాడుతున్నారు. ప్రతీ చిన్న చిన్న జాగ్రత్తలను కూడా వాళ్ళు తీసుకుంటూ బాధితులను కాపాడుతున్నారు. 

 

వారిపై తెలంగాణా సిఎం కేసీఆర్ కూడా పలు సందర్భాల్లో ప్రసంశల వర్షం కురిపించారు. ఇక తాజాగా కరోనా పాజిటివ్ మహిళకు విజయవంతంగా ప్రసవం చేసారు. బిడ్డకు కరోనా సోకకుండా జాగ్రత్తలు పడ్డారు. శస్త్ర చికిత్స ద్వారా ప్రసవం చేసారు వైద్యులు. తల్లి బిడ్డా ఇద్దరూ క్షేమం గా ఉన్నారని ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు మీడియా కు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: