కరోనా వైరస్ కట్టడికి కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా తెలంగాణలో వాయిదాపడిన ఇంటర్ సెకండియర్ భూగోళశాస్త్రం, మో డ్రన్ లాంగ్వేజ్ పేపర్ 2ను పరీక్షను జూన్ మూడో తేదీన నిర్వహించనున్నట్టు ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. గతంలో జారీచేసిన హాల్టికెట్లతోనే విద్యార్థులు పరీక్షకు హాజరుకావాలని ఆయన సూచించారు.
మరోవైపు ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ రెండోరోజు బుధవారం కొనసాగింది. 9,202 మంది ఎగ్జామినర్లు హాజరయ్యారు. అలాగే.. ఒకోట తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.