ఇప్పుడు కరోనా ఏ విధంగా వస్తుంది అనేది ఎవరికి అర్ధం కావడం లేదు.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే దాని పని అది చేయడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని విషయంలో చాలా వరకు అప్రమత్తంగానే ఉన్నా సరే కరోనా వాహకాలు గా చాలా వరకు మన చుట్టూ ఉండే వస్తువులే ఉండటం ఇబ్బంది కలిగిస్తుంది. 

 

ఈ నేపధ్యంలో ఇప్పుడు కొందరు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షాపులు తీసినా సరే సామాజిక దూరం పాటించడమే కాదు మనుషుల దగ్గరకు కూడా వెళ్ళడం లేదు. తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. నాడియాడ్‌లోని ఒక సెలూన్లో పనిచేసేవారు పిపిఇ కిట్లు ధరించి హెయిర్ కట్ చేస్తున్నారు. ఈ ఫోటో లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: