హైదరాబాద్ లోనే మైలార్ దేవి పల్లి బ్రిడ్జి వద్ద ఇప్పుడు చిరుత పులి కలకలం రేగింది. కాటేదాన్ వద్ద చాలా సేపు రోడ్డు మీద నుంచి కదలకుండా గాయాలతో అలాగే పడి ఉంది. అటవీ శాఖ అధికారులు వచ్చి దాన్ని పట్టుకుందాం అనుకునే లోపే అది పారిపోయింది.

 

ఇక ఇదే సమయంలో అది కదలకుండా రోడ్డు మీద ఉండటాన్ని గమనించిన ఒక లారీ డ్రైవర్ దాన్ని దగ్గరగా వెళ్లి చూసాడు. చిరుతను చూడటానికి దగ్గరగా వెళ్ళడంతో కాకినాడ కు చెందిన లారీ డ్రైవర్ మీద అది దాడి చేసింది. ఈ దాడిలో లారీ డ్రైవర్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. దీనితో పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా చిరుత అడవిలోకి పారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: