ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న నేపధ్యంలో పోలీసులు చాలా వరకు కఠినం గా లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రజలు బయటకు రాకుండా చూసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో అక్కడ లాక్ డౌన్ విషయంలో కఠినం గా వ్యవహరిస్తున్నారు. 

 

లాక్ డౌన్ ని ఉల్లంఘించిన వారి మీద కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా వైసీపీ పలాస ఎమ్మెల్యే అప్పల రాజుపై పోలీసులు కేసు నమోదు చేసారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లఘించడం తో ఎమ్మెల్యే పై కేసు పెట్టారు పోలీసులు. ఆయన తో పాటు గా మరో తొమ్మిది మంది మీద కూడా లాక్ డౌన్ ఉల్లంఘించడం పై కేసులు నమోదు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: