అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం పుష్ప. ఇటీవల ఈ సినిమాను అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ఈ సినిమాలో విలన్ ఎవరు అనేది ముందు నుంచి స్పష్టత రావడం లేదు. విలన్ గా విజయ్ సేతుపతిని ఎంపిక చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. 

 

కాని విజయ్ సేతుపతి బిజీ గా ఉండటం తో ఇప్పుడు బాబీ సింహాను ఖరారు చేసారు. లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన లేదా కీర్తి సురేష్ నటించే అవకాశం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: