లాక్ డౌన్ లో ఏ మాటకు ఆ మాట పిల్లలు ఇప్పుడు నరకం చూస్తున్నారు. పాపం బయటకు వెళ్లి ఆడుకునే పరిస్థితి లేదు. ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళే పరిస్థితి అసలు లేదు. ఇంట్లో తిని ఇంట్లో ఉండటమే గాని బయటకు వెళ్లి ఆడుకునే అవకాశం లేదు.

 

కాని తన ఇంట్లో ఉన్న తన ముగ్గురు అక్కలు కూడా తనతో ఆడటం లేదని ఒక బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. తన అక్కతోపాటు ఐదుగురు బాలికలు తనతో ఆడేందుకు నిరాకరిస్తున్నారని, వాళ్ళను అదుపులోకి తీసుకోవాలని, మూడో తరగతి చదువుతున్నా 8 ఏళ్ళ ఉమర్ నిదమ్ అనే బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో పోలీసులు ఉమేష్, నీరజ్ లు బాలుడి ఇంటికి వచ్చి బాలుడి ఫిర్యాదుపై దర్యాప్తు జరిపి వారికి సూచించి వెళ్ళారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: