ఏపీలో లాక్ డౌన్ అమలులో కొన్ని సడలింపు లు ఇచ్చింది ఏపీ సర్కార్. కంటైన్మేంట్ బఫర్ జోన్ మినహా మిగతా ప్రాంతాల్లో అనుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. షాపింగ్ మాల్స్ కి అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. బంగారు ఆభరణాలు, వస్త్రాలు, చెప్పులు దుకాణాలకు అనుమతి లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది సర్కార్. 

 

ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అవకాశం ఇచ్చింది. పండ్లు కూరగాయల షాపులకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు అమ్మకాలు చేసుకునే అనుమతి ఇచ్చింది సర్కార్. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, విజయవాడ, ఏలూరు నగరాలలో అనుమతి లేదని తెలుస్తుంది. త్వరలోనే మరిన్ని సడలింపులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: