ఒక సినిమా వాయిదా పడటం అంటే మామూలు విషయం కాదు. హీరో ఆశలు దర్శకుడి కష్టం నిర్మాత చెమట... ఎలా ఎన్నో వృధా అవుతాయి. ఒకరకంగా చెప్పాలి అంటే ఒక సినిమాతో జీవితం ముడిపడి ఉంటుంది. టాలీవుడ్ లో ఇప్పుడు నలుగురు అన్నదమ్ముల సినిమాలు వరుసగా ఆగిపోయాయి. కరోనా కారణంగా వాళ్ళు ఇప్పుడు తమ సినిమాల విడుదల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. 

 

అక్కినేని సోదరులు; నాగ చైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చే సినిమా ఆగిపోయింది. అఖిల్ హీరోగా వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా వాయిదా పడింది. ఈ రెండు సినిమాలను ఈ నెలలో ఒకటి వచ్చే నెలలో ఒకటి విడుదల చేద్దాం అనుకున్నారు. 

 

మెగా హీరోలు; వైష్ణవ తేజ్... కెరీర్ లో తొలి సినిమా చేస్తున్నాడు. ఉప్పెన అనే టైటిల్ తో వస్తుంది. ఈ సినిమా ఫస్ట్ కాపీ కూడా రెడీ అవుతున్న టైం లో కరోనా దెబ్బ తగిలింది. ఇక సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న సోలో బతుకే సో బెటరూ అనే సినిమా కూడా వాయిదా పడింది. 

 

వీరి సినిమాలు అన్నీ కూడా ఈ రెండు నెలల్లో విడుదల అవ్వాల్సినవే.

మరింత సమాచారం తెలుసుకోండి: