గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు బ్రదర్స్ ఇప్పుడు సమాజ సేవ మీద సామాజిక కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు. తాజాగా మంచు విష్ణు సైనికుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగు వీర జవాన్ల గురించి తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టాడు.
బిడ్డకు జన్మనిచ్చిన తల్లి, మన ఆకలి తీర్చే రైతన్న, తన కుటుంబానికి దూరమై మన భద్రత కోసం కాపలా కాసే వీర జవాన్ ఈ ముగ్గురుకి సరైన గుర్తింపు రావడం లేదని, తెలుగు రాష్ట్రాల్లో రైతులను కలిసా అని సైనికులను కలిసే అవకాశం రాలేదు అని వారికి సంబంధించిన ఫోటోలు వీడియో లు ఉంటే తనకు పంపాలి అని విజ్ఞప్తి చేసాడు.