ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన భారీ ఆర్ధిక ప్యాకేజికి సంబంధించి నేడు కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు. నిన్న చిన్న మధ్య తరగతి కంపెనీలకు రాయితీలు ఇచ్చిన నిర్మల నేడు ఎవరి మీద దయ చూపిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. 

 

నిర్మల ప్రసంగంపై మరోసారి యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తుంది.  వలస కార్మికుల ప్రస్తావన ఉంటుందా ఉద్యోగుల గురించి ప్రస్తావన ఉంటుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక పేద మహిళలు, రైతులకు ఇచ్చే ప్యాకేజి వివరాలు ఏంటీ అనే దాని మీద ఇప్పుడు ప్రపంచం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కాగా ఎం ఎస్ ఎం ఈ లకు నిర్మల 3 లక్షల కోట్లను కేటాయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: