ఇప్పుడు చెన్నై లోని కోయంబేడు మార్కెట్ దేశం మొత్తాన్ని కొంప  ముంచిందా అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కోయంబేడు మార్కెట్ లో ఇప్పుడు భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. మొదట ఒక వ్యాపారికి వచ్చిన కరోనా అక్కడి నుంచి 3 వేల మందికి సోకింది. 

 

ఏపీ తమిళ నాడు రాష్ట్రాలు షేక్ అయిపోయే పరిస్థితి వచ్చింది అనేది వాస్తవం. ఏపీలో పెరుగుతున్న కేసులు అన్నీ కూడా కోయంబేడు లింకులతోనే ఉన్నాయి. పోలీసులకు కూడా కరోనా సోకడం ఇప్పుడు కలవరపెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఎంత మందికి కోయంబేడు లింక్ లు ఉన్నాయి అనే దాని మీద అధికారులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా లారీ డ్రైవర్లకు ఎక్కువగా సోకి ఉండవచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: