లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లో చిక్కుకున్న ఏపీ వాసులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి వారు రావడానికి గానూ ప్రత్యేక ఆర్టీసి బస్సు సర్వీసులను నడుపుతారు. తొలి దశల్ భాగంగా హైదరాబాద్ నుంచి రెండో దశలో బెంగళూరు, చెన్నై నుంచి నడిపే కార్యక్రమం చేస్తారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 

 

వారు ఏపీకి వచ్చిన తర్వాత కచ్చితంగా క్వారంటైన్ లో ఉండాల్సిన అవసర౦ ఉంటుంది. దానికి అంగీకరించిన తర్వాతే టికెట్ ని జారీ చేస్తారు. మియాపూర్‌-బొల్లారం క్రాస్‌రోడ్‌, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్‌, ఎల్బీ నగర్‌ నుంచి ఈ బస్సులను సర్కార్ నడుపుతుంది. ఏసీ బస్సుల్లో గరుడ ఛార్జీ, నాన్‌ ఏసీ బస్సుల్లో సూపర్‌ లగ్జరీ ఛార్జీని ప్రభుత్వం వసూలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: