ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరెంట్ స్తంభాన్ని ట్రాక్టర్ డీ కొట్టడం తో 9 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్ స్తంభాన్ని డీ కొట్టింది ట్రాక్టర్. నాగులప్పాడు మండలం రాపర్ల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వీరు అందరూ మిర్చి కూలీలు అని అధికారులు చెప్పారు. 

 

వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి సేవా కార్యక్రమాలను చేపట్టారు. గాయపడిన వారు అందరిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. వీరిలో మహిళలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. మిర్చి కోతకు వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: