హైదరాబాద్ లోని కాటేదాన్ లో చిరుత పులి ఆపరేషన్ కొనసాగుతుంది. పులి కోసం అధికారులు ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేసారు. 20 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసిన అధికారులు 4 డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసారు. చిరుత కోసం ప్రత్యేకంగా శునకాలను కూడా అడవిలోకి పంపించారు అధికారులు. 

 

మొత్తం 10 శునకాలు అడవిలోకి వెళ్ళాయి. వాటికి కూడా కెమెరాలను ఏర్పాటు చేసారు. 8 గంటల నుంచి ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. పులిని పట్టుకుంటారా లేదా అనేది స్పష్టత రావడం లేదు. ఇప్పటి వరకు అటవీ శాఖ అధికారులు చెయ్యాల్సిన పనులు అన్నీ చేసారు. రెండు మేకలను కూడా అడవిలో ఎర వేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: