దేశ వ్యాప్తంగా కరోనా కేసులు చాలా వేగంగా నమోదు అవుతున్నాయి. ప్రతీ రోజు కూడా మూడు వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ప్రముఖులకు కూడా క్రమంగా కరోనా వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఉత్తరప్రదేశ్ లో బిజెపి యువ నాయకుడు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఆగ్రా నగరానికి చెందిన భారతీయ జనతా యువమోర్చా నాయకుడికి ఇటీవల కరోనా పాజిటివ్ అని వచ్చింది. 

 

ఆగ్రా నగరంలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అతన్ని చేర్చగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీనితో అతని కుటుంబ సభ్యులను సన్నిహితులను కూడా క్వారంటైన్ చేసారు. అతని అంత్యక్రియలను చాలా జాగ్రత్తగా నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: