ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఏపీ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 57 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ఏపీలో 48 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం కాసేపటి క్రితం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. 

 

నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో కరోనా కేసులు 14 చొప్పున నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 1252 మంది కోలుకోగా మొత్తం 2, 157 మందికి కరోనా సోకింది. గడిచిన 24 గంటల్లో 60 మంది డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం పేర్కొంది. యాక్టివ్ కేసులు 857 ఉన్నాయి. కర్నూలు 8, అనంతపురం 4, కృష్ణ 9 కేసులు నమోదు అయ్యాయని ప్రభుత్వం పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: