ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. నాలుగు రోజులు తగ్గాయి అనుకున్న కేసులు 2 వేల కేసులు దాటిన తర్వాత మరింత వేగంగా నమోదు అవుతున్నాయి. ఏపీలో అత్యధికంగా కరోనా కేసులు మూడు జిల్లాల్లోనే నమోదు అవుతున్నాయి. కర్నూలు జిల్లాలో 599 కేసులు నమోదు అయ్యాయి. ఈ జిల్లానే అగ్ర స్థానంలో ఉంది. 

 

గుంటూరు జిల్లాలో 404 కేసులు నమోదు అయ్యాయి. కృష్ణా జిల్లాలో 360 కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు జిల్లాలో 165 కేసులు నమోదు అయ్యాయి. నెల్లూరు జిల్లాలో 140 కేసులు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 122 కడప జిల్లాలో 101 కేసులు నమోదు అయ్యాయి. ప్రకాశం 63 కేసులు, పశ్చిమ గోదావరి 69 కేసులు, విశాఖ 68 తూర్పు గోదావరి 52 కేసులు నమోదు అయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరంలో 7 కేసుల చొప్పున నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: