రైతు భరోసా కార్యక్రమాన్ని సిఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తున్నామని సిఎం జగన్ పేర్కొన్నారు. రైతు భరోసాను పాత అప్పుల కింద బ్యాంకు లు తీసుకోవని జగన్ స్పష్టం చేసారు. దీని ద్వారా 49 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతుంది అని అన్నారు. 

 

ఈ రోజు 10,641 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తున్నామని చెప్పారు జగన్. కౌలు రైతులకు కూడా 7,500 సహాయం చేస్తున్నామని చెప్పారు. గత ఏడాది 6,350 కోట్లను రైతు భరోసా కింద చెల్లించామని జగన్ పేర్కొన్నారు. ఈ నెల 30 నాటికి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుందని జగన్ పేర్కొన్నారు. రైతులకు ఎంత చేసినా తక్కువే అని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: