ఆంధ్రప్రదేశ్ లో రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు సిఎం వైఎస్ జగన్. లాక్ డౌన్ కారణంగా అతన క్యాంపు ఆఫీస్ లోనే ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా 49 లక్షల మంది రైతులకు సహాయం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఖరీఫ్ కి సంబంధించిన పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేసింది.
ఇక ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అండగా ఉంటామని చెప్పిన జగన్... అధికారులు సూచించిన పంటలను వెయ్యాలని పేర్కొన్నారు. 172 లక్షల టన్నులకు ఆహార ధాన్యాలు పెరిగాయని అన్నారు జగన్. రైతులకు ప్రతీ ఏటా కూడా ఆదాయం వచ్చే కార్యక్రమాలను ప్రభుత్వం చేస్తుందని చెప్పారు.