రైతు భరోసా కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సందర్భంగా సిఎం వైఎస్ జగన్ రైతులతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రులను ఎంపీలను అందరిని కూడా అన్నా అంటూ పలకరించారు. వారి యోగ క్షేమాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు జగన్. అన్నా అంటూ ఆప్యాయంగా పలకరించడం లైవ్ లో హైలెట్ గా మారింది. 

 

అనంతపురం జిల్లా రైతులతో లైవ్ లో మాట్లాడుతున్న సందర్భంగా... రంగయ్య అన్నా అంటూ అనంతపురం ఎంపీని, మంత్రి శంకర్ నారాయణను నారాయణ అన్నా... ఆ తర్వాత హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ని ది గ్రేట్ మాధవన్నా అంటూ పలకరించారు. దీనితో అక్కడ లైవ్ లో ఉన్న వారు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సాక్షాత్తు సిఎం అలా పలకరించడం తో ఎంపీ గారు గాల్లో తేలిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: