అమరావతి ఉద్యమం చేస్తున్న రైతులకు, జెఎసి నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేసారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే అమరావతి పోరాటం చేస్తున్న జెఎసి నేతలకు అభినందనలు చెప్పారు ఆయన. 

 

జెఎసి పోరాటం 150 వ రోజుకు చేరినా వైసీపీ సర్కార్ లో చలనం లేదని ఆయన ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పై మండిపడ్డారు. అమరావతి ని కుట్ర పూరితంగా దెబ్బ తీయాలని కుట్ర చేసారని ఆరోపించారు. కాగా అమరావతిని రాజధాని గా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు మహిళలు గత కొన్ని రోజులుగా దీక్షలు చేస్తున్నారు. రాజధాని గ్రామాల్లో ఈ దీక్షలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: