కరోనా వైరస్ వృద్దులకు వస్తే చనిపోవడం ఖాయమని ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కొందరు చెప్పే మాట. కాని మన దేశంలో మాత్రం చాలా మంది వృద్దులు కరోనా వైరస్ సోకినా సరే దాని నుంచి బయటపడుతున్నారు. కేరళ మహారాష్ట్ర, తెలంగాణా రాష్ట్రాల్లో కరోనా సోకిన వృద్దులు చాలా మంది దాని నుంచి ప్రాణాలతో దాదాపుగా బయటపడ్డారు. 

 

ఇతర వ్యాధులు ఉన్న వారు మాత్రమే ప్రాన్లు కోల్పోయారు. వారిని సవాల్ గా తీసుకుని వైద్యులు కూడా చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుని చికిత్స చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఒక బామ్మ గారు లేటు వయసు లో కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. పూర్తిగా కోలుకున్న 94 ఏళ్ల మహిళ నిన్న సాంగ్లీలోని మీరాజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: