హైదరాబాద్ లో ఉంటున్న ఏపీ వాసులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రేపటి నుంచి హైదరాబాద్ లో ఉన్న ఏపీ వారిని తరలించడానికి బస్సులను నడపాలని వాటికి రిజర్వేషన్ కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ముందు 13 వేల మందిని తీసుకుని రావాలని ఏపీఎస్ ఆర్టీసీ ప్రయత్నాలు చేసింది. 

 

అయితే ఇప్పుడు సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. రెండు మూడు రోజుల్లో బస్సులను హైదరాబాద్ పంపిస్తామని ప్రభుత్వం ఒక ప్రకటన లో తెలిపింది. అయితే ఎప్పుడు తీసుకొస్తాం అనేది మాత్రం స్పష్టంగా చెప్పడం లేదు. ఇక అక్కడి నుంచి తీసుకుని వచ్చే వారిని ముందు జిల్లా కేంద్రంలోని క్వారంటైన్ లో ఉంచాలి అని అందుకు ఓకే చెప్పిన వారినే తీసుకుని రావాలని నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: